నేడు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

-

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన భేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరైన రేగా కాంతారావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం పై నేడు సీఎం కేసీఆర్ స్పందించనున్నట్లు తెలుస్తోంది. గురువారమే విలేకరుల సమావేశం అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

కానీ మీడియా సమావేశం జరగలేదు. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ జరగనుందని తెలుస్తోంది. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడిస్తారని.. ఈ సందర్భంగా బిజెపిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news