సినీనటి కుష్బూపై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు

-

సీని నటి ఖుష్బు పై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బిజెపిలోని ఖష్బు ,నమితా, గౌతమి, గాయత్రీ రఘురామన్ లు ఐటమ్స్ అని సంబోధించారు. ఇందులో ఖుష్బు పెద్ద ఐటమ్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా అన్న ఐదు, ఆరు సార్లు చాలా వెళ్ళాడు అనేలా వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు డిఎమ్‌కె నేత సైదైయ్ సాదిక్. అమిత్ షా తలమీదా వెంట్రుకైనా మొలుస్తుందేమో కానీ…. తమిళనాడులో బిజెపి మాత్రం వికసించదని అన్నారు.

డిఎమ్‌కె నేత మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నటి ఖుష్బు. అలాగే ఖుష్బుపై పార్టీ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు కనిమొళీ. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన  వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. సీఎం స్టాలిన్‌ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని అన్నారు. ఇలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మా నాయకుడు స్టాలిన్‌ గానీ, పార్టీ అధిష్ఠానంగానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకేసుకురాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news