నాగర్ కర్నూల్ చేరుకున్న సీఎం కేసీఆర్

-

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాలలో పర్యటించేందుకు కేసిఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కాసేపటి క్రితమే నాగర్ కర్నూల్ చేరుకున్నారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news