ప్రధాని మోడీతో టచ్ లో సీఎం రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రధాని మోడీతో టచ్ లో సీఎం రేవంత్ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవలే బీజీపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కేసీఆర్ కి గవర్నర్ పదవీ, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవీ, హరీశ్ రావుకి అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా అందుకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని.. ప్రధాని నరేంద్ర మోడీతో టచ్ లోనే ఉన్నారని తెలిపారు. ఏబీవీపీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయిందని.. అక్కడే ముగుస్తుందని ప్రధాని మోడీతో చెప్పారు రేవంత్ రెడ్డి. నాకు ఉన్నటువంటి ఢిల్లీ సోర్స్ ద్వారా ఈ సంభాషణ తెలిసింది. ఇది నిజమా..? కాదా..? అనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news