కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. అయితే పేదలకు ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చినప్పటికీ కొన్నింటిని నెరవేర్చకపోవడం గమనార్హం. సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢిల్లీ పర్యటన చేపడుతున్నారు. ఇటీవలే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నారు.  ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news