1200 మంది విద్యార్థుల బలి దానాలకు కాంగ్రెస్సే కారణం : ఎర్రోళ్ల శ్రీనివాస్

-

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు..1200 మంది విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మేమే తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవటానికి అస్సలు సిగ్గుండాలి.ద్రోహులు ఉత్సవాలు చేస్తుంటే అమరుల ఆత్మ ఘోషీస్తోంది. ఒకనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు.

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ముట్టుకునే, చెరిపి వేసే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ చిహ్నాన్ని మార్చవచ్చు కానీ తెలంగాణ ప్రజలతో ఉన్న సాన్నిహిత్యాన్ని విడదీయలేరు. మాపై ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు అమరులైతే, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదు. తెలంగాణ సొమ్మును దోచుకొని, తెలంగాణ ఉద్యమంలో దాక్కున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఎరోళ్ల శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news