బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా కనుమరుగవుతుంది : కిషన్ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి.. చేయలేదని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన నల్లకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తమ పాలనతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పి బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారెంటీలు అమలు చేశాకే రేవంత్ రెడ్డి గ్రామాల్లో తిరగాలని.. లేకపోతే పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రజలకు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news