బండి సంజయ్ పై టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత సంచలన వ్యాఖ్యలు !

-

TRS వరి పై ఉద్యమం చేస్తుంటే…. బీజేపీ గోదుమల ఫోటో పెట్టి ఆరోపణలు చేస్తోందని టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ నాయకులకు గోదుమలకు, వరికి తేడా తెలియదంటూ..కామెంట్ చేశారు. బండి సంజయ్ కి వడ్ల గురించి ఏం తెలియదని చురకలు అంటించారు టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత.

ఇలాంటి బిజేపి పార్టీ నాయకుల గురించి మాట్లాడాలంటే.. మన ఇజ్జతి పోతుందని ఎద్దేవా చేశారు. అనంతరం జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు కార్పొరేటర్ మన్నే కవిత. అయితే మన్నే కవిత.. చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంభందించిన వీడియోను టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో వాడుకుతోంది. ఇక టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత చేసిన వ్యాఖ్యలపై బిజేపి పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. ghmc కౌన్సిల్ లో నిరసనకు దిగారు బిజేపి పార్టీ కార్పొరేటర్లు.

 

Read more RELATED
Recommended to you

Latest news