BREAKING : బీజేపీలో చేరనున్న దాసోజు శ్రవణ్

-

BREAKING : బీజేపీ పార్టీలో దాసోజు శ్రవణ్ చేరనున్నట్లు సమాచారం అందుతోంది. నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌.. ఇవాళ బండి సంజయ్‌ కుమార్‌ ను కలిశారు. అంతేకాదు.. బండి సంజయ్‌ తో కలిసి… ఢిల్లీకి పయనమయ్యారు. జాతీయ నేతల సమక్షంలో దాసోజు శ్రవణ్‌.. బీజేపీ లో చేరే ఛాన్స్‌ ఉంది. దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుంది.

కాగా.. నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌.. రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, మనిక్కం ఠాగూర్, సునీల్ ముగ్గురు కుమ్మక్కయ్యారన్నారు దాసోజు శ్రవణ్‌. ఇద్దరు రేవంత్ కు తాబేధారులు అయ్యారని, ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారని ఆరోపించారు దాసోజు శ్రవణ్‌. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మాణిక్కం ఠాగూర్, సునీల్‌లు రేవంత్ తప్పులపై మాట్లాడడం లేదని, కొప్పుల రాజు, జై రాం రమేశ్ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు దాసోజు శ్రవణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news