జగిత్యాలలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి

-

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఓ ఇంటర్ విద్యార్థి పై డిప్యూటీ వార్డెన్ దాడి చేశారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గత వారం రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. డిప్యూటీ వార్డెన్ నయీమ్ ఇంటర్ విద్యార్ధి పై దాడి చేసారు.. డార్మెటరీ రూమ్ కి వెళ్లాడని.. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో విద్యార్థి రాజు పై డిప్యూటీ వార్డెన్ నయీమ్ దాడి చేశారు.

విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుదులు గుప్పించాడు వార్డెన్. ఆ విద్యార్థి ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా కొట్టాడు. అతన్ని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్ఎల్సి( రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్) సయ్యద్ హమీద్ విచారణకు ఆదేశించారు. డిప్యూటీ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news