డబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి – హరీష్ రావు

-

డబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని అన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన ఆస్పైర్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారిందని అన్నారు. ఆవిష్కరణల సూచీలో కర్ణాటక, తెలంగాణ తొలి రెండు స్థానాల్లో ఉంటే.. గుజరాత్ బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు.

harishrao
harishrao

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలే దీనికి కారణమని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ జాతి సంస్థలు, ఐటీ సంస్థలు ఇక్కడ విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఫినిక్స్ టెక్నాలజీస్ ఇక్కడ అస్పైర్ సొల్యూషన్స్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు హరీష్ రావు. తెలుగు విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news