మ‌హీంద్రా వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో తొలి స్నాత‌కోత్స‌వం.. హాజరైన మంత్రి కేటీఆర్‌

-

భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా… హైద‌రాబాద్‌లో మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ పేరిట ఓ అత్యున్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో విద్యా సంస్థ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ యూనివ‌ర్సిటీకి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు త‌మ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో తొలి స్నాత‌కోత్స‌వం జ‌రిగింది.

Image

ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ప‌ట్టాలు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు, మ‌హీంద్రా కంపెనీ య‌జ‌మాని ఆనంద్ మ‌హీంద్రా స‌హా కంపెనీకి చెందిన ప‌లువురు ముఖ్యులు హాజ‌ర‌య్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news