నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

-

నేడు హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హైదరాబాద్ రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది. ఉదయం 10 సమయంలో ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు చేరుకోనున్న ఆమె… అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళతారు.

ఈ సందర్భంగా పర్యాటకుల సందర్శన తీరును ఆమె సమీక్షిస్తారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్ స్టేడియం లో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125 ఉత్సవాల జయంతి ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఇక రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆమె పర్యటిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news