BREAKING : నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి నిధులపై అలాగే అభివృద్ధి అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చించనున్నారు. విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులపై కూడా సీఎం జగన్ చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news