కెసిఆర్ ఓ కొత్త నాటకానికి తెరలేపాడు – ఈటెల రాజేందర్

-

కేసీఆర్ ఓ కొత్త నాటాకానికి తెరలేపాడని మండిపడ్డారు హుజరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ కలిస్తే తెలంగాణ ను గోల్ మాల్ చేస్తాడని అనుకున్నాం.. ఇప్పుడు అదే జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను కొనుగోలు చేసే సంప్రదాయం కేసీఆర్ దని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మంది ని కొనుగోలు చేసి కాంగ్రెస్ కొంప ముంచిన నాయకుడు కెసిఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ను ప్రశ్నిస్తే మంత్రి పదవి పోతదని తెలిసినా ఆనాడు ప్రశ్నించామని తెలిపారు. మంత్రి గా ఉన్నపుడే టీఆర్ఎస్ పార్టీ కి ఓనర్ ను అని చెప్పిన వ్యక్తి ని నేనని అన్నారు ఈటల రాజేందర్. హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు పెట్టి, పసుపు బొట్టు తో ప్రమాణాలు చేయించిన హుజురారాాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనించారని అన్నారు. ఒక చెంప హుజూరాబాద్ ప్రజలు పగల గొడితే, ఇంకో చెంప పగల గొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని అన్నారు. నవంబర్ 3 వ తేదీన మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టుకునెలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news