మిషన్ భగీరథ కు జాతీయ అవార్డు రాలేదు – కేంద్రం సంచలన ప్రకటన

-

మిషన్ భగీరథ కు జాతీయ అవార్డ్ పై స్పందించిన కేంద్ర జల శక్తి శాఖ…మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దం అని పేర్కొంది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదు..తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదించిందని వెల్లడించింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలి. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదని బాంబ్ పేల్చింది.

గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణకు అవార్డుకు ఎంపికైందని..ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8% నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయని పేర్కొంది. అదేవిధంగా మొత్త నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జల జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించిందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news