చింతల్‌మెట్‌లో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ చింతల్‌మెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై విద్యుత్​ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే షాపింగ్‌ క్లాంప్లెక్స్‌లోని 5 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాంప్లెక్స్ లో పని చేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ ఘటనలో దుకాణాల ముందు నిలిపి ఉంచిన 5 కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడం, నల్లటి పొగ వ్యాపించడంతో స్థానికులు అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.

షాపింగ్​​ కాంప్లెక్స్​ మొదటి, రెండో అంతస్తులో నివాస గృహాలు ఉండగా.. ఆ ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు షాపులు యజమానులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news