హైదరాబాద్ లో కుప్పకూలిన ఫ్లైఓవర్..ఏకంగా 10 మంది !

-

హైదరాబాద్ లో కుప్పకూలింది ఓ ఫ్లై ఓవర్. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ప్రమాదానికి గురైంది. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. పిల్లర్ టూ పిల్లర్ కు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో స్లాబ్ పై పనులు చేస్తున్నారు పది మంది కార్మికులు.

ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు అధికారులు. ఈ సంఘటన జరిగిన సమయంలో బీహార్, యూపీకి చెందిన కార్మికులు ఉన్నారు. ఇక ఈ సంఘటన ప్రాంతానికి ఎల్బీ నగర్ ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి.. జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ… మలుపు ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందని…ఇంజనీర్ల విభాగం సంబంధించిన అధికారులను సంఘటన స్థలానికి పిలుస్తున్నామన్నారు. వాళ్లు వచ్చిన తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందని..తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news