ఏపీ ప్రజల నాడి మొట్ట మొదటిసారిగా అంతు చిక్కడం లేదు : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్  ప్రజల నాడి మొట్ట మొదటిసారిగా అంతు చిక్కడం లేదు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. తాజాగా ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో మొదటి సారి చంద్రబాబు అధికారంలోకి రాగా.. రెండో సారి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారు. ఈ సారి ఎవ్వరూ అధికారంలోకి వస్తారని అంచనా కూడా వేయలేకపోతున్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సగం సగం సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తి గా విఫలం చెందింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు రాజ్ గోపాల్ రెడ్డి. కేంద్రంలో బీజేపీకి అధికారం అంత ఈజీ కాదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news