గజ్వేల్ ఎమ్మెల్యే గా సీఎం కేసీఆర్ వుండడం ఇక్కడి ప్రజల అదృష్టం: మంత్రి హరీష్ రావు

-

గజ్వేల్ ఎమ్మెల్యే గా సీఎం కేసీఆర్ వుండటం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభించుకున్నామని అన్నారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధికై రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మన ఊరు -మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం లో తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల మేలు కోసమే కేసీఆర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవన్నారు.

తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వచ్చాక అన్ని పనుల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో కంటే గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి పోయి డబ్బులు వృధా చేసుకోవద్దని.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్య లక్ష్మి పథకం సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు హరీష్. త్వరలోనే సంగారెడ్డి కెనాల్ తెచ్చి కాలంతో పనిలేకుండా కాలువలు, చెరువులు నింపుతాం అన్నారు. ములుగు లో మరో కోల్డ్ స్టోరేజ్ పండ్ల మార్కెట్ తెస్తున్నామన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news