సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కళాశాలలో విషవాయువు లీక్

-

సికింద్రాబాద్ లోని మారేడుపల్లి లో కస్తూర్బా గాంధీ కళాశాలలో ప్రమాదం జరిగింది. కాలేజీలోని సైన్స్ ల్యాబ్ నుండి ఒక్కసారిగా విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కళాశాల సిబ్బంది అస్వస్థతకు గురైన వారిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియ రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news