హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..ఈ నెల 22న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం

-

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..ఈ నెల 22న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. గ్రేటర్ లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. గ్రేటర్ లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది.

కొల్లూరులో నిర్మించిన 15, 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు లో రూ. 1354.59 కోట్లతో ఎస్ ప్లస్ 9, ఎస్ టెన్ 10, ఏ ప్లస్ 11 అంతస్తుల్లో 15,660 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్షిప్ గా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 145.50 ఎకరాల్లో నిర్మించిన ఈ టౌన్ షిప్ లోని ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు. 117 బ్లాక్ లో నిర్మించగా మౌలిక వసతుల కల్పనతో కలిపి ఒక్క ఇంటి నిర్మాణానికి 8.65 లక్షలు ఖర్చు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news