గల్ఫ్‌ నుంచి వచ్చినవారికి ఉపాధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వండి.. సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

-

గల్ఫ్‌ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి  అన్నారు. కార్మికులు విదేశాల్లో మరణిస్తే రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. గల్ఫ్‌ నుంచి వచ్చినవారికి ఉపాధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 15 లక్షల మంది గల్ఫ్‌లో ఉపాది పొందుతున్నారని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.పది వేలు స్వరాష్ట్రానికి పంపుతారనుకున్నా నెలకు రూ.1500 కోట్లు విదేశీ మారకద్రవ్యం రాష్ట్రానికి, దేశానికి వస్తుందన్నారు. అదే ఏడాదికి అయితే రూ.18 వేల కోట్లు విదేశీ మారకద్రవ్యం సమకూరుతుందని చెప్పారు.

కేరళ ప్రభుత్వం మాదిరిగా గల్ఫ్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తన వినతులను పరిశీలించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. లేఖ కాపీలను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news