చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి.. వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం – రేవంత్ రెడ్డి

-

చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వండి.. వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా తుక్కుగూడలో ఈనెల 06న నిర్వహించే కాంగ్రెస్  జనజాతర సభను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అంటున్నారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే.. జాలి వేస్తుంది. ఆయన అధికారం పోయిన బాదలో ఉన్నారు. 

పదేళ్ల తరువాత రైతులు గుర్తుకొచ్చారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా..? అని ప్రశ్నించారు. వానాకాలంలో అధికారంలో ఉన్నదే కేసీఆర్.. కేసీఆర్ చేసిన పాపాల వల్లనే కరువు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పాపాలు పిల్లలకు తగిలి జైలుకు వెళ్లారు. పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ మాకు చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎండిపోయిన తరువాత మంటల దగ్గర కేసీఆర్ చలి కాచుకుందాం అనుకుంటుండు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆత్మహత్య చేసుకున్న 200 మంది రైతుల వివరాలు రెండు రోజుల్లో కేసీఆర్ ఇవ్వాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news