రైతులకు గుడ్ న్యూస్..రూ.2లక్షల రుణమాఫీ ప్రారంభం ఎప్పుడంటే..?

-

రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు పంట రుణాలు ఉన్న అర్హులకు లోన్లు మాఫీ చేయనున్నట్లు తెలిపింది. 18వ తేదీ సాయంత్రం లోగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వెల్లడించింది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల హాజరు అవుతారని తెలిపింది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news