ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేటీఆర్ భరోసా

-

ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మాజీ మంత్రి కేటీఆర్  భరోసా ఇచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఈ దాడిలో ఆ దంపతుల పిల్లలు కూడా గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ తాజాగా  ఆ గిరిజన కుటుంబాన్నిపరామర్షించారు.

ఈ సందర్బంగా వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు కేటీఆర్. ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయంతో పాటు దాడిలో గాయపడ్డ ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే చూసుకుంటానన్న కేటీఆర్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ.. దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news