కట్నం కోసం పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు

-

ప్రేమించుకున్న ఆ జంట ఎంతో కష్టపడి పెద్దలను పెళ్లికి ఒప్పించారు. ఈనెల 25వ తేదీ వివాహానికి సిద్ధం చేశారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి వరుడు పారిపోయాడు. ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేశాడు.

స్థానికులు తెలిపిన ప్రకారం… సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్‌ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కొన్ని ప్రయత్నాల తర్వాత చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల వారూ నిర్ణయించారు.

శుక్రవారం కొండాపూర్‌ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి సర్వం సిద్ధం చేశారు. అనూహ్యంగా రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని పెళ్లి కుమారుడు భీష్మించాడు. అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news