2 లక్షల రుణమాఫి పొందినవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి – హరీష్ రావు

-

2 లక్షల రుణమాఫి పొందినవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. పొందనివారు కారు గుర్తుకు ఓటు వేయండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు బాధలు పడుతుంటే.. ఈ ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోకుండా తాపకోసారి ఢిల్లీకి పోతున్నాడు అన్నారు హరీష్ రావు.

రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులైనా రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, నేను మోసం చేసినా కూడా నాకే ఓటేశారని హామీలను గాలికి వదిలేస్తాడు అని వెల్లడించారు హరీష్ రావు. బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి రూ. 2,500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాడు.. ఇవి బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని అరియాపనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news