రుణమాఫీ జరగలేదని సురేందర్ ఆత్మహత్య – హరీష్‌ రావు

-

రైతు రుణమాఫీ జరగలేదని సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని… నా చావు కు కారణం క్రాప్ లోన్ అవ్వక పోవడం అని సూసైడ్ నోట్ రాశారని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరదలు, రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.

harish rao on surendhar reddy farmer issue

తన తల్లి కి తనకి కలిసి ఉన్న రేషన్ కార్డు ఉండడం వల్ల రుణమాఫీ కాలేదని… బ్యాంక్ మేనేజర్ రుణమాఫీ జరగదు అని చెప్పడంతో బాధ పడ్డాడని వివరించారు. ప్రభుత్వ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడని… ప్రభుత్వం రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పింది.. కానీ అది అవాస్తవం అన్నారు హరీష్‌ రావు.

కుటుంబాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ కొడుకు మధ్య చిచ్చు పెట్టాడని పేర్కొన్నారు. గతంలో పాస్ బుక్ ఉంటే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదన్నారు. 21లక్షల మందికి రుణమాఫీ కాలేదని.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్పారని గుర్తు చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news