హిమాన్షు పెద్ద మనస్సు.. రూ.కోటి ఖర్చుతో పాఠశాల ఆధునికీకరణ

-

కల్వకుంట్ల హిమాన్షు… ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే.. తాజాగా సీఎం KCR మనవడు, మంత్రి KTR కుమారుడు హిమాన్షు పెద్ద మనసు చాటుకున్నాడు. గచ్చిబౌలి కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ. కోటి వెచ్చించి అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

విద్యార్థులకు బెంచీలు, టాయిలెట్ల నిర్మాణం, డైనింగ్ రూమ్, ఆట స్థలాన్ని ఏర్పాటు చేయించారు. హిమాన్షు కాజగూడలోని ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగా… ఈ ప్రభుత్వ బడిని చూసి చలించిపోయి అభివృద్ధికి కృషి చేశారు. కాగా, కల్వకుంట్ల హిమాన్షు రావు ఓ అరుదైన ఘట్టాన్ని అందుకున్నాడు. ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news