ఒకే రోజు.. రెండు వేర్వేరు ప్రమాదాలు.. భార్యాభర్తలు మృతి

-

ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భార్యాభర్తలిద్దరు మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల మరణం గురించి తెలుసుకున్న వారి కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అంతంపల్లికి చెందిన సిద్దయ్య అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా…… గ్రామ శివారున జాతీయ రహాదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనండంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగం బైక్‌పై ఘటనాస్థలానికి వెళ్తుండగా…..అదుపు తప్పి కిందపడిపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా…..అతని భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగంను కూడా అదే ఆస్పత్రికి తరలించారు.

అయితే తీవ్ర గాయాలపాలైన సిద్దమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతిచెందడంతో….. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news