అంగరంగ వైభవంగా యాదాద్రీశుడి జ‌యంత్యుత్స‌వాలు ప్రారంభం

-

యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఆలయ అర్చకులు స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు. ఈనెల 4వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జ‌యంత్యుత్స‌వాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 6:00 గంటలకు అంకురార్పణ, రుత్విగ్వరణం, హవనం నిర్వహించి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 2 నుంచి 4 వరకు సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత తిరు కల్యాణోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఉత్సవాల సందర్భంగా ప్రధానాలయంలోని ఉత్తర రాజగోపురం వెలుపలి ప్రాకార మండపంలో యాగశాల ఏర్పాటు చేశారు. బుధవారం రోజున ఉదయం 9 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, కాళీయ మర్థన అలంకార సేవలో స్వామివారిని తిరుమాఢవీధుల్లో ఊరేగించనున్నారు. 10:30 గంటలకు లక్ష పుష్పార్చనలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవ ఉంటుంది.

4వ తేదీన 7 గంటలకు మూలమస్తృ హవనం, ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news