ఈనెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి కృష్ణారావు

-

ఈనెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి కృష్ణారావు చేరనున్నారు.  కాంగ్రెస్ లో చేరే విషయమై ఆ పార్టీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు. ఈనెల 20న నాగర్ కర్నూల్ కోల్హాపూర్ సభలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు పరోక్షంగా తెలిపారు.

ఈ క్రమంలో ప్రియాంక సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. MLC దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో సహా 14 నియోజకవర్గాల నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జూపల్లి పేర్కొన్నారు. కాగా, మొన్న జరిగిన జనగర్జన సభలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news