నరేంద్ర మోడీని ఓడించేందుకు నేను పోటీ చేస్తా : కే.ఏ.పాల్

-

భారత ప్రధాని  నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు. తాను తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై నేను పోటీ చేస్తానని కే.ఏ. పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారoటిలకు నాది గ్యారెంటీ అని.. నాలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలి. నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరు అన్నారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేదు అని.. ఇతర సాకులతో గడిపేస్తారు.

ప్రజాశాంతి పార్టీకి ఇక సింబల్ రానుంది.. టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను 50 కోట్లు అడుగుతున్నారట. దేశంలో రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలి. జెడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్ బిజెపిలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడి , అమిత్ షాలు కోరారు. కానీ నేను వెళ్ళలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు కే.ఏ.పాల్.

Read more RELATED
Recommended to you

Latest news