ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కడియం శ్రీహరి, కేకే ఫ్యామిలీ !

-

Kadiam Srihari: ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం శ్రీహరి, కేకే ఫ్యామిలీ మెంబర్స్‌. గాంధీ భవన్ లో ఇవాళ సాయంత్రం కడియం శ్రీహరి, కేకే చేరనున్నట్లు సమాచారం. కాగా తాను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Kadiam Srihari and KK family will join the Congress party today

మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు మున్షీ తెలిపారు. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వరంగల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున కావ్య పోటీ చేయనని ప్రకటించింది. ఈ తరుణంలోనే కడియం శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ నేతలు కలవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news