తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు ? – కవిత

-

 

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు ? అంటూ ఫైర్‌ అయ్యారు కల్వకుంట్ల కవిత. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత.. తన సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్కు ఎందుకు కక్ష ? అంటూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నలు సంధించారు.

రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటి ? మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా ??” అని ఆగ్రహించారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news