అలాంటి ఘనత ఒక్క బాలయ్యకే సాధ్యమా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ నిర్మాతల శ్రేయస్సును కోరుకునే అతి కొద్ది మంది హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అలా నిర్మాతల మనిషి అని పిలిపించుకునేవారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలయ్య కూడా అదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా సినిమాకు ఎంత పారితోషకం తీసుకున్నా సరే నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఆలోచన ఉండే ఏకైక హీరోగా బాలయ్య గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ రూ. 600 కోట్ల రేంజ్ లో తమ సినిమాలకు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు అంతే స్థాయిలో పారితోషకం కూడా తీసుకుంటున్నారు.. కానీ బాలకృష్ణ మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా జనాల మధ్య షూటింగ్ ను ఇష్టపడుతూ జనాల మధ్య సూట్ లో పాల్గొంటే తనకు సంతోషంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని బాలయ్య ఇలా చేయడం వల్ల నిర్మాతలపై భారం కూడా తగ్గుతుందని చెప్పాలి.

కానీ చాలామంది చిన్న హీరోలు కూడా చిన్నచిన్న సీన్లకి కూడా సెట్స్ వెయ్యాలని కోరుతూ ఉంటే బాలయ్య మాత్రం సహజంగా ఉన్న వాటిలోనే సినిమా షూటింగ్ లు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇండస్ట్రీలో ఈ విధంగా చేసే హీరో కేవలం బాలయ్య మాత్రమేనని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో బాలయ్యకు ఎవరు సాటి రారని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news