మోడీ సభకు కెసిఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది: బండి సంజయ్

-

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభతో రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోడీ సభకు కెసిఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీని కట్టడి చేసేందుకు సీఎంవో లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ ను ప్రజలే పట్టించుకోవడంలేదని.. బీజేపీ కూడా పట్టించుకోదని తెలిపారు. పులి వస్తే జింక పారిపోయినట్లు కెసిఆర్ పారిపోతున్నారు అని విమర్శించారు.

 

జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభ పనులను ఆయన పర్యవేక్షించారు. జూలై 3న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టీ పాలసీలను ప్రకటించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి సభ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పది లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news