కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ దళితులకు వెన్నుపోటు పొడిచారు – కిషన్ రెడ్డి

-

ఈనెల 8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు కేంద్రమంత్రి, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైల్వే శాఖ కు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని.. వందలాది మంది తెలంగాణ కోసం బలిదానం అయ్యారన్నారు. ఈ రోజు తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బంది అయిందన్నారు.

బందీ అయిన తెలంగాణ కు స్వేచ్ఛ స్వతంత్రము కల్పించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దీని కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో పాతర వేయాలని కంకణం కట్టకున్నామన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫార్మ్ హౌస్ కి పరిమితం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని అన్నారు కిషన్ రెడ్డి. నేను కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ దళితులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news