ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధం: అచ్చెన్నాయుడు

-

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన ముందస్తు ఎన్నికల అంశంపై అధికార పార్టీ మాత్రం ప్రశాంతంగా ఉండగా, ప్రతిపక్ష పార్టీ మాత్రం అప్పుడే నీళ్లు నములుతోంది.. ఒకవైపు చంద్రబాబు వరుసగా నియోజకవర్గ ఇంచార్జి లతో సమీక్ష మీటింగ్ లను నిర్వహిస్తుండగా, తాజాగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు ఎన్నికలపై కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. కాకినాడ లోని గొల్లప్రోలులో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… సీఎం జగన్ ఢిల్లీకెళ్లి ముందస్తుగా ఎన్నికలు జరపాలని అక్కడ పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని సామజిక వర్గాలు కూడా జగన్ పై చాలా వ్యతిరేకతతో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది మాత్రం టీడీపీ అని, ఇది నేను చెప్పడం లేదని సర్వేలు దీనికి రుజువన్నారు.

ప్రజల్లో మాకు పూర్తిగా బలం ఉంది మరియు ప్రజలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి… మేము సిద్ధంగా ఉన్నాము అంటూ అతివిశ్వాసం ధోరణిలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news