కేసీఆర్ కి పిచ్చి ముదిరి మాట్లాడుతున్నారు – భట్టి విక్రమార్క

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కి పిచ్చి ముదిరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ అనేది మా పేటెంట్ అని అన్నారు భట్టి. తగుదునమ్మ అంటూ బిఆర్ఎస్ ఇప్పుడు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టామన్నారు.

ఉచిత విద్యుత్ కేసీఆర్ పాలసీ కాదని.. అది మా పాలసీ అని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుంది, అక్కడి అవసరానికి వెసులుబాటు ఇస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తామన్నారు బట్టి. సోషల్ మీడియాలో బిఆర్ఎస్ తప్పుడు కథనాలు రాయిస్తుందని.. తప్పుడు ప్రచారం చేసే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు బుద్ధి చెప్పాలని అన్నారు. బిఆర్ఎస్ ఎత్తిపోయిన పార్టీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు బట్టి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news