కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు.. రైతులను పాడే ఎక్కించడానికి – వైఎస్ షర్మిల

-

కేటీఆర్ తీరు పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదన్నట్లుందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతును రాజు చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొర గారు.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలన్నారు. “31 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రాజులయ్యిండ్రా ? ఎరువులు ఫ్రీ అనే ఉత్తమాటలు చెప్పినందుకు రైతును రాజును చేసినట్లా? రూ.14 వేల కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొడితే రైతులు రాజులయ్యారా..?

ముష్టి రూ.5 వేలు ఇచ్చి రూ.35 వేల సబ్సిడీ పథకాలు బంద్ పెడితే రైతును రాజు చేసినట్లా? 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి పట్టుమని 8 గంటలు ఇవ్వని పాలన రారాజు పాలన అంటారా? రైతు రాజైతే పదేండ్లలో 9 వేల మంది రైతుల చావులు ఎట్లా జరిగినయ్? వరి వేస్తే ఉరి అని చెప్పిన మీ దరిద్రపు పాలన ఆగమైన వ్యవసాయానికి ఆత్మహత్యలే శరణ్యమనడానికి నిదర్శనం. రుణాలు కట్టక రాజులు కాదు.. బ్యాంకుల దగ్గర మోసగాళ్లను చేశారు.

మీ పాలన “రైతును రాజు చేసిన పాలన కాదు – రైతును రోడ్డుమీదకు” తెచ్చిన పాలన. తెచ్చిన అప్పులకు పెళ్ళాం పుస్తెలు సైతం అమ్ముకునేలా చేశారు. పండించిన పంటకు గ్యారెంటీ లేక రైతుల మెడకు ఉరి తాడేశారు. కలో గంజో తింటూ ఉన్న భూమిని నమ్ముకుంటే.. ధరణి పేరుతో భూములు గుంజుకొని రైతులను రోడ్డున పడేశారు. రైతు అనేవాడు 59 ఏళ్లలోపు చనిపోవాలని మరణ శాసనం రాశారు. రైతుల చావుల్లో దేశంలోనే నెంబర్ 1… ఇదేనా రైతును రాజు చేసే పాలన! కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికి.

ఈ దేశపు గడ్డ మీద రైతును రారాజు చేసింది మహానేత YSR ఒక్కడే. ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశాడు. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులు చేశాడు. సబ్సిడీ పథకాలు పెట్టి రైతుకు విలువ తెచ్చాడు. ఊహించని గిట్టుబాటు ధర కల్పించాడు. పంట నష్టం జరిగితే పండించిన దానికన్నా రెండింతలు ఎక్కువే ఇచ్చాడు. మహానేత పాలన రైతాంగం చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం” అని ట్వీట్ చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news