రేపు BRS నేతలతో కేసీఆర్ కీలక భేటీ..కీలక ప్రకటన చేసే ఛాన్స్

-

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన 20 రోజుల్లోనే వీరితో సమావేశం కానుండడం గమనార్హం.

వచ్చే నెల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమావేశంలో కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, చిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాష్ట్ర చెస్ క్రీడాకారుడు.. ఉప్పల ప్రణీత్(16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రణీత్​ విజయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్, తల్లిదండ్రులను సచివాలయం పిలిపించుకున్న సీఎం… ప్రణీత్ కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news