సిట్ అధికారులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు తిరిగి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీట్ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. సిట్ విచారణకు బిఎల్ సంతోష్ గైర్హాజరు పై హైకోర్టు విచారణ చేపట్టింది. బిఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యాలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు ఏజి. ఈనెల 20వ తేదీననే నోటీసులు అందినప్పటికీ బియ్యం సంతోష్ హాజరు కాలేదని న్యాయస్థానానికి వెల్లడించారు ఏజీ.

ఆయన వాదనతో ఏకీభవించిన హై కోర్ట్ సంతోష్ విచారణకు హాజరయ్యాలా చూడాల్సిన బాధ్యత పిటిషనర్ పై ఉందని పేర్కొంది. బిఎల్ సంతోష్ కి ఈమెయిల్ ద్వారా 41ఏ సిఆర్పిసి నోటీసులు మళ్లీ ఇవ్వాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం ఈ కేసు పై విచారించిన కోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందరి కారణంగా మధ్యాహ్నానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news