కిషన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన

-

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు చాతిలో నొప్పి రావడంతో ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో ఎయిమ్స్ లోని సీసీయూలో చేరారు. కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకి వైద్యం అందిస్తున్నారు. ఆయనకి కడుపులో గ్యాస్ సమస్య వల్ల చాతినొప్పి వచ్చిందని తెలిపారు వైద్యులు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

అయితే తాజాగా మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. కార్డియాక్ కేర్ యూనిట్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు వైద్యులు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news