కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు కాదు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కిషన్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు కాదు ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మూసీ కష్టాలు అంటే ఏంటో..? నల్గొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని తెలిపారు. అధికారం పోయినా కూడా బీఆర్ఎస్ నేతల్లో ఇంకా అహంకారం మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. కేబుల్ బ్రిడ్జీ తప్ప హైదరాబాద్ కి బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు.

రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్గొండ ప్రజలేం అమాయకులు రాదని.. నల్గొండ ప్రజలది దొరలు చెబితే వినే రక్తం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా మూసీ ప్రక్షాళన పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల బాధలు కిషన్ రెడ్డికి తెలియవా..? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన అనేది గొప్ప కార్యక్రమం అని తెలిపారు. బాధితులను రోడ్డున పడనివ్వబోమని డబుల్ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news