TRS ను ఓడించడమే నా జీవిత లక్ష్యం – కోమటిరెడ్డి రాజగోపాల్

-

TRS ను ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. కెసిఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండని ఛాలెంజ్‌ విసిరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా అని నిలదీశారు. ఎందుకు వివక్ష చూపిస్తున్నావు… బఫున్ లాంటి మంత్రిని పంపించి హల్చల్ చేయిస్తున్నాడని కెసిఆర్ పై మండిపడ్డారు. యెనిమిది ఎండ్లాలో కెసిఆర్ లక్షల కోట్లు సంపాదించారని.. వచ్చే రోజుల్లో అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఫైర్‌ అయ్యారు.

అలాగే.. బీజేపీలో చేరడంపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసింది వాస్తవమేనని.. అయితే రాజీనామా, రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసినా చేరిక గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తేల్చి చెప్పారు. పార్టీ మారాల్సి వస్తే భువనగిరి, మునుగోడు ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ లో కొందరు నేను గిట్టని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు… ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news