మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో తనకూ ఒక మంత్రి పదవి కావాలని తన మనసులో మాట బయటపెట్టారు. మీ అన్నకు మంత్రి పదవి ఇచ్చారు కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి ? అని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ మంత్రి పదవి తనంతట తానే దగ్గరికి వస్తది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వస్తే ఏంది. నాకూ వస్తది. ఆయన తెలంగాణ కోసం తన మంత్రి పదవి త్యాగం చేసిండు. నేను తెలంగాణ కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసిన ’. సమర్థులైనప్పుడు ఇద్దరికీ ఇవ్వొచ్చు కదా ? కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పా?. తెలంగాణ ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని కాబట్టి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నా’ నని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news