కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో జూపల్లి, పొంగులేటి భేటీ..ఇక కాంగ్రెస్‌ లోకేనా ?

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసం లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు పాటు వీరూ ముగ్గురు చర్చించుకున్నారు.

అయితే.. ఈ సమావేశం అయ్యాక, మీడియా తో మాట్లాడ కుండానే వెళ్లిపోయారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. మర్యాద పూర్వక భేటీ అంటూ వెళ్లారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేసామని.. అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసినట్లుగా చెప్పారు జూపల్లి. టీ తాగడానికి కోమటిరెడ్డి పిలిస్తే వచ్చానన్న జూపల్లి… మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news