ఆదిలాబాద్‌లో కేటీఆర్ బైక్ ర్యాలీ

-

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి యువనేత హాజరుకానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, మథోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2,111 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి.

ప్రతి పోలింగ్‌స్టేషన్‌ నుంచి ఇద్దరు నాయకులు, నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో యువనేత పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పదేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రంలో నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రస్తావించే అవకాశముంది. ఇప్పటికే ఆదిలాబాద్ కి చేరుకున్న కేటీఆర్ తొలుత నేరేడుగొండ టోల్ ప్లాజా నుంచి ఆదిలాబాద్ వరకు జరగనున్న బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news